వేములవాడ (Vemulawada)లో లారీ (Lorry) బీభత్సం సృష్టించింది (Road Accident). మొదటి బైపాస్ రహదారి మహాలక్ష్మి వీధిలోని విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అటునుంచి మూలవాగు వంతెనపై డివైడర్లను లారీ ఢీకొట్టి.. తిప్పాపూర్లోని కదిరే రాజమల్లయ్య దుకాణంలోకి దూసుకు వచ్చింది. ఈ ఘటనలో రాజ మల్లయ్య ద్విచక్ర వాహన కన్సల్టెన్సీలోని ఐదు వాహనాలు ధ్వంస మయ్యాయి. డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని కాలనీవాసుల వెల్లడించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
previous post
next post

